BHPL: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో గత రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని తెలిపారు. చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు ఉండవద్దని ఆయన సూచించారు.