E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం రాత్రి 8.60 అడుగుల నీటిమట్టం కొనసాగుతున్నట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి 3,46,486 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామన్నారు. అలాగే తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 12,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.