NLG: ఎంజీయూ (MGU) కామర్స్ విద్యార్థులకు ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం’ (PMEGP)పై అవగాహన కల్పించారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పథక ఉద్దేశాలు, బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, దరఖాస్తు ప్రక్రియపై నిపుణులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆచార్య శ్రీదేవి, డైరెక్టర్ డా. సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.