GNTR: తెనాలికి చెందిన టీడీపీ నాయకురాలు జెట్టి రేణుకపై సోషల్ మీడియాలో అసభ్యకర, అసత్య ప్రచారాలు చేసినందుకు బాపట్లకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి షేక్ సయ్యద్ను తెనాలి రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. టీటీడీ ఛైర్మన్ వ్యవహారంలో ఆమెను ఉద్దేశించి సయ్యద్ దుష్ప్రచారం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామని సీఐ తెలిపారు.