TPT: శక్తి స్వరూపిణి వెంకటగిరి పోలేరమ్మ జాతర మొదలైంది. ఇవాళ పీఠ పూజ చేసి అమ్మవారి ప్రతిమను తయారు చేసేందుకు మట్టిని సేకరిస్తారు. మట్టితో బొమ్మను తయారు చేస్తారు. రాత్రి 11 గంటల వరకు అమ్మవారి ప్రతిమ తయారీ జరుగుతుంది. అనంతరం జినిగలవారి వీధిలోని చాకలివారి మండపానికి అమ్మవారిని తీసుకొచ్చి దిష్టి చుక్క పెడతారు. అక్కడి నుంచి ఆలయానికి తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు.