E.G: రాజమండ్రి క్వారీ ఏరియాలో నిర్మాణంలో ఉన్న శ్రామిక భవనాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అప్పగించాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ హెచ్చరించారు. బుధవారం గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యవర్గ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వంలో 1800 గజాల స్థలం, రూ.1 కోటి నిధులు మంజూరైనా పనులు పూర్తికాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.