GDWL: మానవపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సంధ్యా కిరణ్మయి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సరిగా తనిఖీ చేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి గర్భిణీకి సురక్షితమైన సాధారణ ప్రసవాలు జరగాలని అధికారులు జాగ్రత్తగా చూడాలని ఆమె సిబ్బందికి ఆదేశించారు.