TPT: అలిపిరి – చెర్లోపల్లి మార్గంలోని అటవీ ప్రాంతంలో కర్ణాటకకు తరలిస్తున్న 36 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో దుంగలతోపాటు లగేజీ వ్యాను, కారు, బైకును సీజ్ చేశామన్నారు. దుంగల విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందన్నారు.