SRD: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా అధ్యక్షుడు బుచ్చేంద్ర మాట్లాడుతూ.. దివ్యాంగులకు నెలకు 6 వేలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.