NLR: వరికుంటపాడు మండలం భోగ్యం వారి పల్లె వద్ద 565 జాతీయ రహదారిపై సోమవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్ సహాయంతో పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.