AKP: మాకవరపాలెం మండలం జీ.కోడూరులోని క్వారీని రద్దు చేయాలని నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద దళిత రైతులు చేస్తున్న నిరసన సోమవారం నాటికి 48వ రోజుకు చేరింది. ఈ క్వారీ వల్ల తమ వ్యవసాయ భూములకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇన్ని రోజులుగా తాము నిరసన చేస్తున్న అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా క్వారీ అనుమతులు రద్దు చేయాలని కోరారు.