SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల నమోదు , పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి *Meekosam.ap.gov.in* వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని ప్రకటనలో తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.