గ్రహణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. సుప్రభాతసేవతో తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. ఉదయం 9:30 నుంచి ద్వారక తిరుమల ఆలయంలో దర్శనాలు ప్రారంభంకానున్నాయి. 8:30 నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి అనుమతించనున్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, భద్రకాళి, రామప్ప, కాళేశ్వరం ఆలయాలలో సంప్రోక్షణ తర్వాత ఉ.7గం.ల నుంచి దర్శనాలకు అనుమతించనున్నారు.