AKP: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ బాధ్యతలు దక్కడంపై మాడుగుల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.