ELR: రహదారి ప్రమాదాల నివారణ ధ్యేయంగా జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు. బుధవారం ఏలూరు ఆశ్రమం హాస్పటల్ సమీపంలో హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు. హెల్మెట్లు ధరించిన వారిపై జరిమానాలను విధించకుండా వారితో 55 హెల్మెట్లను కొనుగోలు చేయించారు. రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికంగా హెల్మెట్ లేకపోవడం ఒక కారణమని పోలీసులు అన్నారు.