SRCL: సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా శనివారం సాగుతున్న గణేష్ శోభాయాత్రను పోలీసులు కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలు, నిమజ్జన ప్రదేశం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరగగా, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు తలెత్తినట్లు అయితే వెంటనే వైర్లెస్ సెట్ ద్వార సమాచారం తెలుపుతున్నారు.