కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ కర్నూలు నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజును మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత, విద్యా నాణ్యత మెరుగుదలపై వారు చర్చించారు.