తూ.గో: దేవరపల్లి మండలం పల్లంట్ల బీసీ కాలనీలో కొత్తగా వేసిన సీసీ రోడ్లను డ్రైనేజీల కోసం ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రణాళిక లేకుండా పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు ముందుగానే డ్రైనేజీలకు స్థలం కేటాయించి రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.