SKLM: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి రెండు మాసాలు ముందుగానే ప్రారంభించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. మే నెల నుంచి ఖరీఫ్ మొదలయ్యే దిశగా ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.