ప్రకాశం: యర్రగొండపాలెం TDP కార్యాలయంలో గురువారం ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 21 మందికి రూ. 18 లక్షలు విలువచేసే చెక్కులను పంపిణీ చేసినట్లు ఎరిక్షన్ బాబు తెలిపారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోరాదని ఆయన పేర్కొన్నారు.