మన్యం: దివ్యాంగులకు ఉపకరణాలను జేసీ ఎస్.ఎస్.శోబిక సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పంపిణీ చేశారు. పాలకొండ మండలం కొండవీధికి చెందిన జె.తేజశ్రీ, సీతానగరం మండలం వెంకటాపురంకు చెందిన కట్టమూరి కార్తీక్ తమకు ట్యాప్లను మంజూరు చేయాలని కోరగా, జేసీ వాటిని పంపిణీ చేశారు. కొమరాడ మండలం అర్థం గ్రామానికి చెందిన వడ్లమాని ప్రసాదరావుకు చెవిటి మిషన్ను పంపిణి చేశారు.