SKLM: జలుమూరు మండలం లింగాలపాడు పంచాయతీ ఎర్రనపేట ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి బమ్మిడి మాధవరావు గురువారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు ఉన్న సామర్థ్యం ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలపై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంపై కార్య నిర్వాహకులతో చర్చించారు.