VZM: రెవెన్యూ సేవలు నిజాయితీగా అందించాలని బొబ్బిలి ఎమ్మార్వో ఎం.శ్రీను సూచించారు. సోమవారం స్దానిక MRO కార్యాలయంలో VROలు, రెవెన్యూ ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు. రెవెన్యూ పనులు కోసం అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2019కు ముందు ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేసిన ఇళ్లను క్రమబద్దీకరణ చేయాలన్నారు.