KNR: పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నుంచి ‘మన ఊరు-మన బాధ్యత’ పేరుతో మత్తుపదార్థాలు, ఆన్లైన్ బెట్టింగ్పై అవగాహన కార్యక్రమాలు మంగళవారం నుంచి నిర్వహిస్తున్నారు. చెడువ్యసనాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ చర్యల్లో భాగంగా ప్రత్యేక పోస్టర్లను సోమవారం ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్నారు.