కృష్ణా: తోట్లవల్లూరు మండలం కుమ్మమూరు గ్రామంలో బందరు కాల్వ నుంచి కుమ్మమూరు కాల్వ వరకు నిర్మించిన డ్రాప్ను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా సోమవారం ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాల్వల అభివృద్ధితో రైతులకు సకాలంలో నీరు అందుతుందని తెలిపారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.