NDL: శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగడం వలన మల్లన్న దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. దీంతో ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, అర్జిత అభిషేకాలు,కుంకుమార్చనలను తాత్కాలికంగా నిలిపివేశారు. దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.