ఎన్టీఆర్: కంచికచర్ల గ్రామానికి చెందిన ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు జాహిదా.. ఈ నెల 27 నుంచి 30 తేదీ వరకు కేరళలో జరుగుతున్న జాతీయ మహాసభల్లో ఎస్.ఎఫ్.ఐ ఆలిండియా కమిటీ సభ్యురాలుగా జాహిదాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆమెకు ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.