MBNR: ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు సెల్ ఫోన్ ఉపయోగించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. సెల్ ఫోన్లో మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జిల్లాలో ఆయా మండలాల ఎంఈవోలు హెచ్ఎంలకు తగిన మార్గదర్శకాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 3,227 పాఠశాలలు ఉండగా 3,58,505 మంది విద్యార్థులు చదువుతున్నారు.