TG: కాంగ్రెస్ పాలనలో గురుకులాలు నిర్వీర్యం అవుతున్నాయని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. ‘ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకుల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవటంతో ఆహార సామాగ్రి సరఫరా నిలిచిపోయింది. విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు ఇవ్వకపోవటం సిగ్గుచేటు. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి’ అని డిమాండ్ చేశారు.