CTR: బోయకొండ గంగమ్మ తల్లి ఆలయంలో టికెట్లు ద్వారా ఒక్కరోజులో రూ. 17.01 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం తెలిపారు. ఆషాడ మాసం పురస్కరించుకొని ఆలయంలో రద్దీ ఊహించని స్థాయిలో కొనసాగిందన్నారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 17,01,315, ఉచిత అన్నదానం పథకానికి రూ. 10 వేలు, గోశాల నిర్వహణకు రూ. 5 వేలు సమకూరినట్లు చెప్పారు.