NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. వర్షాలు లేక ఆశించిన స్థాయిలో ప్రాజెక్టులోకి నీరు చేరటం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 15.671TMCలు, నిజాంసాగర్లో 5.122TMCల నీరు మాత్రమే ఉంది. పోచారం, కళ్యాణి ప్రాజెక్టులోకి వరదనీరు రావటం లేదు. కృష్ణ బేసిన్లోని ప్రాజెక్టులోకి మాత్రం వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.