ATP: కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైద్య నిపుణులు రోగులకు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.