SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి చెందిన గోశాలలో పనిచేయుట కోసం నియమించిన సిబ్బందికి నియామక పత్రాలను పంపిణీ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 40 మందికి గాను, 38 మంది సిబ్బందికి గురువారం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.