KNR: ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా చొప్పదండి పోలీసుల ఆధ్వర్యంలో గురువారం పరివర్తన ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, యువకులు ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎస్సై నరేష్ రెడ్డి మాదక ద్రవ్యాల నియంత్రణకై విద్యార్థులతో యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ , ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు.