GNTR: సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. పరిమి రోడ్డులో వృద్ధ మహిళలు రాజేశ్వరి, అంజమ్మలను అత్యంత దారుణంగా హత్య చేసింది కుసుమ కుమారి, గోపి, మరో మైనర్ అని నిర్ధారించారు. వృద్ధుల ఒంటిపై ఉన్న బంగారం కోసమే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు డీఎస్పీ జనార్ధనరావు సోమవారం మీడియాకు వెల్లిడించారు.