ఖమ్మం: రాజీవ్ యువ వికాస్ పథకంను వెంటనే అమలు చేసి లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయాలని జిల్లా కమిటీ DYFI ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం డీవైఎఫ్ఎ జిల్లా కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలకై రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.