ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ(SP) ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. అభయ్ సింగ్, రాకేష్ ప్రతాప్, మనోజ్ కుమార్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ పరిణామం యూపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనపై SP కఠిన చర్యలు తీసుకుందని తెలుస్తోంది.