AP: గుంటూరు జిల్లా తెనాలిలో వృద్ధ మహిళల జంట హత్యల కేసును మూడో పట్టణ పోలీసులు ఛేదించారు. బంగారం, నగదు కోసం వృద్ధురాళ్లను నిందితులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో కుసుమ, గోపితో పాటు మరో బాలుడిని అరెస్టు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుండగా మరో హత్య గురించి వారు వివరించారు. గతంలో బంగారం కోసం మారిస్పేటకు చెందిన మహిళను హత్య చేసినట్లు కుసుమ ఒప్పుకుంది.