AP: కడప జిల్లా మైదకూరు నియోజకవర్గంలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. సమస్యలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో.. విద్యార్థులు, మహిళలు బురదలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. దారి కావాలని వేడుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.