AP: కుప్పం నియోజకవర్గంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు శిరీషతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి ఘటనలను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆమెకు రూ.5లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు