NTR: తల్లికి వందనం సంక్షేమ పథకాన్ని చారిత్రాత్మకంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…తల్లికి వందనం పథకం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు.