CTR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుండగా కుప్పంలో మాత్రం బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్సీ భరత్ పేర్కొన్నారు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన అత్యంత హేయమైన చర్య అన్నారు. టీడీపీ వాళ్లు ప్రజలపై విరుచుకుపడి విధ్వంసాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.