VZM: ఎస్.కోట వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలను ఎమ్మెల్యే లలిత కుమారి మంగళవారం పంపిణీ చేశారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతుల నుండి విక్రయించిన ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేసే ఘనత తమ ప్రభుత్వానిదేనని కొనియాడారు. గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.