NLG: సీలింగ్ భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేయాలని కోరుతూ ఎల్లారెడ్డిగూడెం రైతులు నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 399,411, 414,415,425,426,444 గల సర్వే నెంబర్లలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గత 40–50 సంవత్సరాలుగా తాము వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ తమకు పక్కా హక్కులు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు.