MDK: మనోహరాబాద్ మండలం కూచారం పరిధిలోని రైలు పట్టాల వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కూచారం 241 రైల్వే గేట్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్న ఈ వ్యక్తి చేతిపై ‘సాయి’, ‘అమ్మ’ అని పచ్చబొట్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.