NGKL: అచ్చంపేట మండలం గుంపన్పల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేసి సోమవారం కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో వారు పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ రెడ్డి, రామనాథం పాల్గొన్నారు.