NGKL: ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషనను రద్దు చేయాలని, ఎర్రవల్లి గ్రామంతో పాటు తండాలను ముంపు నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 92వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన జీవో వచ్చే వరకు తమ నిరసనలు ఆపేది లేదని బాధితులు తెగేసి చెప్పారు. ఈ దీక్షలో ఎర్రవల్లి, తండా ప్రజలు పాల్గొన్నారు.