KRNL: జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 27వరకు నిర్వహించనున్నారు. 69 కేంద్రాల్లో 17,129 మంది విద్యార్థులు హాజరుకానున్నారని విద్యాశాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ 10,865, ప్రైవేట్ 5,532, ఓపెన్ స్కూల్ 736 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి.