VZM: గరివిడి మండలం పరిషత్ కార్యాలయానికి మూడు చక్రాల సైకిల్స్ చేరుకున్నాయి. ఈ వాహనాలు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా 22 పంచాయతీలకు మంజూరయ్యాయని ఈవోపీఆర్డీ పుష్పాంజలి తెలిపారు. పంచాయతీలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు అందిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయాన్నే చెత్త శుభ్రం చేసి తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్కి తరలించడానికి ఉపయోగపడుతుందన్నారు.