NGKL: కల్వకుర్తి మండలంలోని గుండూరులో 40 ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించినట్లు బుధవారం ఎంపీడీవో వెంకట రాములు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఆయన అన్నారు. ఎంపీడీవో వెంట ఇందిరమ్మ కమిటీ మండల పర్యవేక్షకులు విజయభాస్కర్, సిబ్బంది ఫిరోజ్ ఖాన్, రాఘవేందర్ పంచాయతీ కార్యదర్శి వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.